29, డిసెంబర్ 2011, గురువారం

హోం > తాజా వార్తలు అక్కినేని అన్నపూర్ణ అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అక్కినేని అన్నపూర్ణ అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. కుమారులు అక్కినేని వెంకట్, నాగార్జున, మనవడు సుమంత్‌లు చితికి నిప్పంటించారు. మొదట అన్నపూర్ణ స్టూడియోస్‌కు అన్నపూర్ణమ్మ భౌతిక కాయాన్ని తరలించి, అక్కడి నుంచి ఇఎస్ ఐ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు.

అత్యంత సన్నిహితులు మినహా లోపలికి ఎవ్వరినీ అనుమతించలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణను కడసారి చూసేందుకు తరలివచ్చారు. ఓదార్పు యాత్ర పూర్తి చేసుకున్న ఈ ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన వైఎస్‌ జగన్‌ అక్కినేని కుటుంబాన్ని స్వయంగా వెళ్లి సంతాపం తెలియజేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls