తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మూడు మంత్రి పదవుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. కేబినెట్లో చిరు వర్గంలోని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసిందట. అయితే చిరు మాత్రం ముగ్గురుకి కావాలని కోరుతున్నారట. మూడు ప్రాంతాల నుండి ముగ్గురుకి పదవులు ఇస్తే తన వర్గానికి లబ్ధి చేకూరుతుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం. అందుకే ఆయన మూడు పదవుల కోసం అధిష్టానం వద్ద ప్రయత్నిస్తున్నారట. కానీ అధిష్టానం మాత్రం రెండింటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
మంత్రివర్గంలో ఇద్దరికి చోటు కల్పించడం ద్వారా చిరు ఆశలు నెరవేర్చే దిశలో అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటికీ మూడో పదవి విషయమే ఆయనను కొంత ఆసంతృప్తికి గురి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అధిష్టానం ఇచ్చిన రెండు మంత్రి పదవులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులకు కేటాయించే అవకాశముంది. ఉద్యమం నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వాలని చిరు భావిస్తున్నారట
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
pls