నెల్లూరు సిటీ, న్యూస్లైన్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అహంకారంతో విర్రవీగుతున్నాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. నగరంలోని ఎన్టీఆ
ర్భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇసుక మాఫియా, మద్యం సిండికేట్ల నుంచి నెలమామూళ్లు వసూలు చేస్తున్న వివేకానందరెడ్డి అధికార, ధనబలంతో కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. ఆనం సోదరులు నగరాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. 2001లో ఇంటి పన్నులు పెంచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వివేకా గగ్గోలు పెట్టాడని, ప్రస్తుతం 200 శాతం ఇంటి పన్నులు పెంచి ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు.
ఇంటి పన్నుల పెంపును నిరసిస్తూ గోడలపై రాసిన ప్రచారంలో తన పేరు ఉందనే అక్కసుతో వివేకానందరెడ్డి పలు చోట్ల గోడ రాతలను సైతం మున్సిపల్ సిబ్బందితో తుడిపించి వేశారని పేర్కొన్నారు. నగరంలోని హోర్డింగులు, ప్లెక్సీల పై వివేకా, ముంగమూరు , మరొకరి ఫొటోలు మాత్రమే కన్పించాలంటే కుదరదని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డికి కొమ్ముకాస్తున్న అధికారులు సైతం త్వరలో జైలుకు పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ధర్మవరపు సుబ్బారావు, వైవీ సుబ్బారావు, పడవల కృష్ణమూర్తి, మండవ రామయ్య, కిలారి వెంకటస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇంటి పన్నుల పెంపును నిరసిస్తూ గోడలపై రాసిన ప్రచారంలో తన పేరు ఉందనే అక్కసుతో వివేకానందరెడ్డి పలు చోట్ల గోడ రాతలను సైతం మున్సిపల్ సిబ్బందితో తుడిపించి వేశారని పేర్కొన్నారు. నగరంలోని హోర్డింగులు, ప్లెక్సీల పై వివేకా, ముంగమూరు , మరొకరి ఫొటోలు మాత్రమే కన్పించాలంటే కుదరదని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వివేకానంద రెడ్డికి కొమ్ముకాస్తున్న అధికారులు సైతం త్వరలో జైలుకు పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ధర్మవరపు సుబ్బారావు, వైవీ సుబ్బారావు, పడవల కృష్ణమూర్తి, మండవ రామయ్య, కిలారి వెంకటస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
pls