28, డిసెంబర్ 2011, బుధవారం

బాబా ఆలయ డిపాజిట్ల విలువ రూ. 500 కోట్లు

నాగ్‌పూర్: భారత్‌లో ఆర్థిక పరిపుష్టి సాధించిన ఆలయాల్లో ఒకటిగా నిలుస్తున్న షిరిడీ సాయి బాబా దేవాలయం మరో ఘనతను సాధించింది. ఆలయ వర్గాలు వెల్లడించిన వార్షిక నివేదిక ప్రకారం మార్చి 31, 2010 వరకు మొత్తంగా 500 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు కలిగి ఉంది. వీటిలో పలు జాతీయ బ్యాంకుల్లో 466 కోట్ల రూపాయల విలువైన డిపాజిట్లకు తోడు, 40.84 కోట్ల రూపాయల కిసాన్ వికస పత్రాలు, 22 కోట్ల రూపాయల ప్రభుత్వ బాండ్ల ఒప్పందాలు వెరసి 529 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు కలిగి ఉంది.

వీటన్నింటి కీ అదనంగా 28 కోట్ల రూపాలయ విలువైన బంగారు, 4 కోట్ల రూపాయల వెండి ఆభరణాలు కూడా సాయిబాబా పేరిట ఉన్నాయని ఆలయం తెలిపింది. ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి నిత్యం అశేష సంఖ్యలో షిరిడీకి వస్తున్న భక్త జనం నుంచి ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని సత్కార్యాలకు వినియోగించనున్నట్లు ఆలయ నిర్వాహక విభాగం వెల్లడించింది. షిరిడీలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, డ్రై నేజీ వ్యవస్థ మెరుగుదల, భక్తులకు వైద్య సదుపాయాలు, పలు రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls