దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తర్వలో తాను ‘రామాయణం’ సినిమా తీస్తున్న ప్రకటించిన విషయం తెలిసిందే. తన తీయబోయేది మోడ్రన్ రామాయణ సినిమా అని, అందులో నాగార్జునను ‘రావణుడి’ పాత్రలో చూపించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు కూడా. అయితే ఇదంతా వర్మ పబ్లసిటీ స్టంట్ అని అనుకున్నప్పటికీ.... వర్మ మాత్రం ఈ ప్రాజెక్టుపై సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జున మీడియా ముందు తనది రావణుడి పాత్ర అని ఒప్పుకోక పోయినా...ఎట్లాగయినా నాగార్జునను కన్విన్స్ చేయగలననే ధీమాతో వర్మ ఉన్నాడు. ఇక పోతే నాగార్జున సరసన నయన తారను మండోదరి పాత్రలో డిసైడ్ చేసిన వర్మ ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరిపాడని, నయన తార నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చిందని తాజా సమాచారం.

శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా అద్భుతమైన నటన కనబర్చిన నయన తార...తాజాగా ఈ పాత్రకు ఒప్పకున్నట్లు వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అసలు శ్రీరామరాజ్యం సినిమా తర్వాత సినిమాలకు దూరం అని చెప్పిన నయన తార మళ్లీ రూటు మార్చడం ఏమిటి? అందులోనూ మండోదరి పాత్రలో... ప్రభుదేవ ఎలా ఒప్పుకున్నాడనే వార్తలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి..
కాగా...త్వరలోనే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి ప్రెస్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమెంతో....సినిమా ప్రారంభమయ్యే వరకు నమ్మడం కష్టం సుమీ.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
pls