29, జనవరి 2012, ఆదివారం

ట్విట్టర్ విషయంలో మహేష్ బాబు తీరు సమర్థనీయమా


Mahesh Babu
సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అభ్యంతరకర పోస్టులను సెన్సార్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో...ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సైట్లు కొత్త సెన్సార్ విధాలను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎవరు ఎలాంటి పోస్టులు చేసినా...తొలుత సెన్సార్ చేసిన తర్వాతే పోస్టు చేయబడతాయి. ట్విట్టర్లో కొనసాగుతున్న హీరో మహేష్ బాబు సెన్సార్ విధానంపై స్పందిస్తూ...ట్విట్టర్ మంచి నిర్ణయం తీసుకుంది. అభ్యంతరకర పోస్టులు, వ్యక్తిగత అభ్రిపాయాలకు పబ్లిక్ ఫోరంలలో స్థానం లేకుండా చేయడం అభినందించదగ్గ విషయమే, కొందరి వాదనలు మరికొందరి మనసులను గాయపరచవచ్చు, ఫిల్టరింగ్ విధానం మంచిదే అని పేర్కొన్నారు.

అయితే ఈ సెన్సారింగ్ విదానాలను మరికొందరు తప్పు పడుతున్నారు. ఇలా చేయడం ప్రాథమిక హక్కలను కాలరాడయమే అని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని, ఇలా చేయడం నియంతృత్వ ధోరణి కిందకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ తీరుతో పాటు అందుకు అంగీకారం తెలిపిన ఆయా సైట్ల తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ సెన్సార్‌షిప్‌ను మహేష్ బాబు సమర్థించడంతో.......మహేష్ బాబు తీరు సమర్థనీయమా? అనే వాదన తెరపైకి వచ్చింది. ఆయన తీరు సబబే అని కొందరు అంటుంటే? స్టార్ హోదాలో ఉండి వ్యక్తి గత స్వేచ్ఛకు భంగం కలిగిచే నిర్ణయాలను సమర్థించడం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

వేములవాడలో ఎద్దుల వీరంగం, కాణిపాకంలో వింతశబ్ధం


Vemulawada-Kanipakam,
కరీంనగర్/చిత్తూరు: కరీంనగర్ జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో రెండు కోడె దూడలు ఆలయ ప్రధాన ద్వారం ఎదుట సోమవారం ఉదయం గంట సేపు వీరంగం సృష్టించాయి. వరంగల్ జిల్లాలో మేడారం జాతర ప్రారంభం కావడంతో వేములవాడకు కూడా భారీగా భక్తులు తరలి వచ్చారు. ఏడు గంటల సమయంలో రెండు కోడె దూడలు ఎదురు పడి కుమ్ముకున్నాయి. భక్తులు, పోలీసులు వాటిని అదుపులోకి తీసుకు రావడానికి ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు. దాదాపు గంట సేపటి తర్వాత పోలీసులు వాటిని అదుపులోకీ తీసుకొని అక్కడే ఉన్న మండపంలో కట్టి వేశారు. అవి పోటా పోటీగా కుమ్ముకోవడంతో భక్తులు భయంతో అక్కడి నుండి పారిపోయారు. నాలుగు దుకాణాలు, ఒక ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో కొద్దిగా తొక్కిసలాట జరిగింది. సుమారు పది మంది భక్తులకు గాయాలయ్యాయి.

మరోవైపు కాణిపాకంలో ఓ వింత శబ్ధం భక్తులను ఆందోళనకు గురి చేసింది. కాణిపాకం పుణ్యక్షేత్రంలోని ఓ హుండీ నుండి ఉదయం వింత శబ్ధం వచ్చింది. ఎక్కడైనా బాంబు ఉందేమోనని అందరూ ఆందోళన పడ్డారు. అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. చిత్తూరు నుండి బాంబ్ స్క్వాడ్‌ను రప్పించారు. అయితే హుండీలో ఉన్న ఓ ఇంపోర్టెడ్ వాచ్ వల్ల ఈ శబ్ధం వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆకట్టుకుంటున్న రాజమౌళి వీడియో


SS Rajamouli
రాజమౌళి వీడియో ఒకటి ఇప్పుడు యూ ట్యూబ్ లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజమౌళి ప్రారంభం రోజుల్లో ఓ యాడ్ కోసం నటించి చూపిన ఓ క్లిప్ అందరిని ఆకట్టుకుంటోంది. ఆయన మంచి దర్శకుడుగానే అందరికీ పరిచయమైనా ఆయనలోని ఓ మంచి నటుడు దాగి ఉన్నాడని ఈ క్లిప్ తెలుపుతోంది. ఆ క్లిప్ ఇదే.. http://www.youtube.com/watch?v=bork-yu1ZG8&feature=youtu.be ఇక ప్రస్తుతం రాజమౌళి ఈగ తుది మెరుగులు దిద్టటంలో బిజీగా ఉన్నారు. నాని,సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ఓ విజువల్ వండర్ గా చెప్తున్నారు. రీసెంట్ గా ఆ చిత్రానికి చెందిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇక ఈగ గురించి ఆయన చెపుతూ..సినిమా ప్రారంభమైన తొలి అరగంటలోనే హీరో చనిపోతాడు. అతని ఆత్మ... ఓ 'ఈగ'లో వాలుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలు. చిన్న ఈగ బలవంతుణ్ని ఎలా ఎదుర్కొంది? అసలు ఈగ పగకు కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ ఆసక్తికరం.

వినోదం, ఉత్కంఠత మేళవించి చూపిస్తున్నాం. ఇందులో హృద్యమైన ప్రేమ కథ ఉంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. మూడు పాటలున్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. అలాగే ...బలవంతుడైన ప్రతినాయకుడిని ఎదుర్కోవాలంటే కథానాయకుడికి కనీసం ఆరు పలకల దేహం ఉండాలి. రెండు చేతుల్లో అధునాతన ఆయుధాలుండాలి. ఎత్తుకు పైఎత్తులు వేసేంత తెలివితేటలు కావాలి. ఇన్ని ఉన్నా... ప్రతినాయకుడిని పడగొట్టాలంటే పతాక సన్నివేశాల వరకూ ఆగాలి. ఇవేమీ లేకుండానే చిన్న కీటకం.. ఓ బలవంతుడి కొమ్ములు విరిచింది. అదెలాగో తెలియాలంటే మా 'ఈగ' సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఇక 'ఈగ'లో నాని, సమంత జంటగా నటిస్తున్నారు. కన్నడ నటుడు సుదీప్‌ కీలక పాత్రధారి. కొర్రపాటి సాయి నిర్మాత. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తారు.ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌, సంగీతం: కీరవాణి.

నేను ‘దేవుడిని’ అని ప్రకటించుకున్న వర్మ


Ram Gopal Varma
ఎప్పుడూ ఏదో ఒక వివాదం, సంచలన ప్రకటనలు, తన టింగరి వేషాలతో వార్తల్లో నిలుస్తూ పబ్లిసిటీ పెంచుకోవడమే లక్ష్యంగా సాగుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి అందరి నోట చర్చనీయాంశం అయ్యాడు. ఈ సారి వర్మ ఏం చేశాడో తెలుసా? బాబాలు, స్వామీజీల మాదిరి తనను తాను ‘దేవుడు’గా ప్రకటించుకున్నాడు. ఇందుకు తన ట్విట్టర్‌ను వేదికగా చేసుకున్నాడు.

తాను గత జన్మలో దేవుడిని...అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అసలు దేవుడంటే నమ్మకం లేదని గతంలో ఉన్నోసార్లు ప్రకటించిన వర్మ....ఇప్పుడు ఇలా తనను తాను దేవుడిగా ప్రకటించుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ హిందీలో ‘డిపార్ట్ మెంట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, అమితాబ్, తెలుగు హీరో రాణా, మంచు లక్ష్మి, మధు శాలిని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘రామాయణం’ సినిమాతో పాటు ‘అమ్మా 3డి’ అనే చిత్రాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

26, జనవరి 2012, గురువారం

London Fireworks on New Year's Day 2011 - New Year Live - BBC One

2012 Taipei 101 New Year Fireworks HD complete 台北101煙火 Taiwan 2011 / 201...

AIFO -PART 5-2010 VINJAMUR RADOSTAVAM BY ALL INDIA FRIENDS ORGANIZATION

25, జనవరి 2012, బుధవారం

పుట్టినరోజు సినిమాకెళ్లేవాణ్ణి

‘‘నాకు ఫస్ట్ నుంచి బర్త్‌డే జరుపుకునే అలవాటు లేదు. అనవసరంగా డబ్బులు ఖర్చు. సినిమా తప్ప చిన్నప్పట్నుంచీ నాకు మరో లోకం తెలీదు. అందుకే పుట్టినరోజు వస్తే సినిమాకు వెళ్లిపోయేవాడ్ని. అయినా ఏడాది ఆయుష్షు తరిగిపోతే బాధపడాలికానీ... వేడుకలేంటండీ బాబూ...’’ అన్నారు రవితేజ. నేడు(గురువారం) ఆయన పుట్టిన రోజు. 

ఈ సందర్భంగా బుధవారం విలేకరులతో ముచ్చటిస్తూ రవితేజ పై విధంగా స్పందించారు. తాజాగా తను నటిస్తున్న ‘నిప్పు’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘గుణశేఖర్ అభిరుచికి తగ్గట్టుగా, నా స్టైల్‌లో ఈ సినిమా ఉంటుంది. వైవీఎస్ నాకు ఫ్రెండ్‌గా ఇప్పటివరకూ తెలుసు. ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా చూశాను. కచ్ఛితంగా తనతో మరో సినిమా చేస్తాను’’ అన్నారు. 

తానూ సూర్య కలిసి నటించే సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదని, పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పటికి నాలుగు సినిమాలు చేశానని, అయిదో సినిమా ‘దేవుడు చేసిన మనుషులు’ త్వరలోనే మొదలవుతుందని చెప్పారు. అలాగే శివ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ‘దరువు’లో సరదాగా సాగే మాస్ కేరక్టర్ చేస్తున్నానని, ప్రస్తుతం ఫైనలైజ్ అయినవి ఈ రెండు సినిమాలేనని రవితేజ తెలిపారు

విశ్వరూపం తరువాత అమర్ హై

విశ్వరూపం చిత్రం తరువాత అమర్‌హై అంటున్నారు కమలహాసన్. భారతదేశం గర్వించదగ్గ నటులలో ముందుండే నటుడు కమల్. ఈ సకల కళా వల్లభు డు ప్రస్తుతం విశ్వరూపం చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తమిళచిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఏ చిత్రం రూపొందని విధంగా వందకోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం విశ్వరూపం. 

ఈ చిత్రం క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ మినహా మొత్తం చిత్రం పూర్తి అయ్యిందని కమల్ వెల్లడించారు. తన తదుపరి చిత్రం కోసం కూడా ఆయన సిద్ధం అవుతున్నారు. ఈసారి కమల్ అవినీతిపై పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. తమిళం, హిందీ భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రానికి అమర్‌హై అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర స్క్రిప్టును ఆయన రెండేళ్ల క్రితమే తయారు చేశారట. 

ఆర్థికపరమైన కొన్ని కారణాల వల్ల అప్పట్లో ఈ కథను తెరకెక్కించే ప్రయత్నం చేయలేదని, ఇప్పుడు సరైన సమయంగా భావిస్తున్నట్టు కమల్ పేర్కొన్నారు. విశ్వరూపం హిందీ వెర్షన్‌కు సంభాషణలు సమకూర్చిన అతుల్ తివారినే ఈ అమర్‌హై చిత్రానికి మాటలు రాస్తున్నారని తెలిపారు

మా మ్యూజిక్ అవార్డుల ప్రదానం ‘సార్ వస్తారొస్తారా...’ అంటూ స్వాతి ఆలపించిన పాట ప్రత్యేక ఆకర్షణ అయ్యింది.

నింగిలోని తారలతో సినిమా తారలు పోటీపడ్డారా?... అనేట్లుగా బుధవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ ప్రాంగణం కళకళలాడింది. ఆట, పాటలతో ఆ సాయంత్రం ఆహ్లాదకరంగా సాగింది. ఇందుకు వేదికగా నిలిచింది ‘మా మ్యూజికల్ అవార్డ్స్’.

మంజులారామస్వామి టీమ్ చేసిన క్లాసికల్ డాన్స్, దేవిశ్రీప్రసాద్ ఆటా పాటా, అనిరుధ్ పాడిన ‘కొలవెరి...’ పాట, శ్రీకృష్ణ-సునీతలు పాడిన వేటూరి క్లాసిక్స్, గీతామాధురి, ప్రణవి, శ్రీకృష్ణ, మాళవికలు పాడిన సిరివెన్నెల పాటలు ఆహూతులను ఆకట్టుకోగా, ఛార్మి డాన్స్, ‘డియాలో డియాలో...’ పాటకు మరియమ్ జకారియా వేసిన స్టెప్పులు హుషారు పెంచాయి.

‘సార్ వస్తారొస్తారా...’ అంటూ స్వాతి ఆలపించిన పాట ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. బాబా సెహగల్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇలా ఈ అవార్డుల వేడుక రసవత్తరంగా సాగింది. ఈ వేదికపై ‘శ్రీరామరాజ్యం’ యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించారు. నందమూరి బాలకృష్ణ, నయనతార, బాపు, యలమంచిలి సాయిబాబు, జొన్నవిత్తుల, సమీర్‌ను కె.రాఘవేంద్రరావు, డా. డి. రామానాయుడు, పి.సుశీల, మా టీవీ ఛైర్మన్ ఎన్. ప్రసాద్‌లు సత్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘మా ‘శ్రీరామరాజ్యం’ యూనిట్‌ని సత్కరించినందుకు మా టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. 

మంచి చిత్రాలు తీస్తే.. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని మరోసారి నిజం చేసిన సినిమా ఇది’’ అన్నారు. సాహిత్య ప్రపంచంలో తనదైన శైలిలో రాణిస్తున్న సిరివెన్నెల సీతారామశాస్త్రికి ‘జీవితకాల సాఫల్య పురస్కారాన్ని’ అందజేశారు. ఉత్తమ నేపథ్య సంగీతానికిగాను ఇళయారాజా తరఫున యలమంచిలి సాయిబాబు అందుకున్నారు. ఉత్తమ రచయితగా జొన్నవిత్తుల, పాపులర్ మ్యూజిక్ డెరైక్టర్‌గా దేవిశ్రీప్రసాద్, సంగీత దర్శకుడిగా తమన్ ఎన్నికయ్యారు. 

మ్యూజికల్ ఫిలిం ఆఫ్ ది ఇయర్‌కి గాను ‘దూకుడు’ నిర్మాతలు, డాన్స్ నంబర్ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్, బెస్ట్ సింగింగ్ సెన్సేషన్‌గా స్వాతి, బెస్ట్ ఇన్‌స్పిరేషన్ సాంగ్ రచయితగా సుద్దాల అశోక్‌తేజ అవార్డులు స్వీకరించారు. ఈ వేడుకలో కె.విశ్వనాథ్, అల్లు అరవింద్, కె.అచ్చిరెడ్డి, గుణ్ణం గంగరాజు, ఎస్వీ కృష్ణారెడ్డి, నందినీరెడ్డి, మణిశర్మ, చంద్రబోస్, అమల, సుమంత్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాగచైతన్య, వరుణ్ సందేశ్, పుల్లెల గోపిచంద్ తదితరులు కూడా పాల్గొన్నారు. ‘మా గోల్డ్’ చానల్‌ను ఇదే వేదికపై ప్రారంభించారు

జర్నీపై శ్రీను వైట్ల కామెంట్స్

శర్వానంద్ ప్రధాన పాత్రలో మురుగదాస్ నిర్మించిన తమిళ డబ్బింగ్ సినిమా జర్నీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది. ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ....‘చాలా రేర్‌గా వచ్చే సినిమా ఇది. ప్రేక్షకులపై ఎంతో ప్రభావం కలిగించేలా దర్శకుడు శరవణన్‌ ఈ చిత్రాన్ని మెచూరిటీతో ఎంతో సహజంగా రూపొందించారు అని చెప్పుకొచ్చారు. గోపాల్‌ మాట్లాడుతూ ‘జర్నీ’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశం కంటతడిపెట్టిస్తుంది’ అన్నారు. 3కెSrinu Vytla ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో ఎస్‌.కె.పిక్చర్స్‌ బ్యానర్‌పై సురేష్‌ కొండేటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.

ఇక పోతే....మంచి ఎమోషనల్ జర్నీగా సాగే ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి పాజిటివ్ రిపోర్ట్ రావటంతో డిస్ట్ర్రిబ్యూటర్స్,ఎగ్జిబిటర్స్ మంచి హ్యాపీగా ఉన్నారు. ఇక శర్వానంద్ సైతం తెలుగులో చాలా గ్యాప్ తర్వాత హిట్ రావటంతో చాలా సంతోషంగా ఉన్నాడు. గమ్యం తర్వాత శర్వానంద్ కు లభించిన మరో హిట్ ఈ చిత్రం.

శ్రీను వైట్ల ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే పనిలో బిజిగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇటీవల దూకుడు సినిమాతో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న శ్రీను వైట్ల జూనియర్ మరోసారి ఇండస్ట్రీకి మంచి హిట్ ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి దర్శకత్వంలో దమ్ము సినిమాలో నటిస్తున్నారు.

బిజినెస్ మేన్‌తో జర్నీ హీరోయిన్ ఎంగేజ్‌మెంట్

Ananya

జర్నీ సినిమాలో అమాయకంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ అనన్య రియల్ లైఫ్‌లో భార్య పోస్టులోకి వెళ్ల బోతోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న అనన్య ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయింది. అంజనేయన్ అనే బిజినెస్ మేన్ ఈ మలయాళ కుట్టి భర్త కాబోతున్నాడు.

అంజనేయన్ అనన్యకు వీరాభిమాని. ఆమె సినిమా షూటింగులు జరుగుతుండగా తరచూ వెళ్లి చూసే వాడు. ఈ క్రమంలో ఆమెపై మనసు పారేసుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఒకసారి సెట్ లోనే పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకారం తెలపడంతో వ్యవహారం ఎంగేజ్ మెంట్ వరకు వచ్చింది. నిశ్చితార్థం తర్వాత పెళ్లి తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

మలయాళంలో పాపులర్ హీరోయిన్ అయిన అనన్య ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. అనన్య నటించిన ‘జర్నీ’ చిత్రం ఇటీవల తమిళం, తెలుగు భాషల్లో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా శరవనణ్ దర్శకత్వం వహించారు.
Journey Success Meet

గుడ్ న్యూస్..: జనవరి 30న కొత్త బజాజ్ పల్సర్ విడుదల


New 2012 Pulsar
పల్సర్ ప్రియులను ఎప్పటి నుండో ఊరిస్తున్న సరికొత్త "బజాజ్ పల్సర్" విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల (జనవరి) 30వ తేదీన తమ సరికొత్త పల్సర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నామని బజాజ్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. మంగళ వారం తమ కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా రాజీవ్ బజాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బజాజ్ పల్సర్‌కు, తాము కొత్తగా విడుదల చేయనున్న పల్సర్‌కు దాదాపు ఎలాంటి పోలికలు ఉండవని, దీనిని సరికొత్త ఫ్లాట్‌ఫామ్‌పై రూపొందించామని, ఇందులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న డిటిఎస్-ఐ టెక్నాలజీ కన్నా మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామని కంపెనీ పేర్కొంది.

ఇది కేవలం బజాజ్‌కు మాత్రమే తర్వాతి స్థాయి (నెక్స్ట్ లెవల్) కాదు, భారత్‌లోని మోటార్‌సైకిల్ సెగ్మెంట్లోనే ఇది తర్వాతి స్థాయిగా నిలువనుంది. తొలుత ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పల్సర్‌లో ఉపయోగించనున్నామని, ఆ తర్వాతి కాలంలో డిస్కవర్‌ బ్రాండ్‌లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామని రాజీవ్ బజాజ్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇవి రెండూ కూడా బజాజ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్‌లు. రాజీవ్ బజాజ్ వ్యాఖ్యల ప్రకారం, కొత్త పల్సర్‌లో ఉపయోగించనున్న ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలోనే మరెక్కడా లేదుట. మరి కొత్త పల్సర్ బైక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందులో లేక ఆర్ఈ60 ఫోర్-వీలర్ మాదిరిగా నిరుత్సాహపరుస్తుందో.. వేచి చూడాల్సిందే..! మీరేమంటారు..?

డెట్రాయిట్ ఆటో షోలో మాసేరటి కుబాంగ్ ఎస్‌యూవీ

ప్రముఖ సూపర్ లగ్జరీ కార్లు తయారీ సంస్థ మాసేరటి, గడచిన సెప్టెంబర్ నెలలో జర్మనీలో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో ఆవిష్కరించిన సరికొత్త ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) "కుబాంగ్"ను అమెరికాలో జరుగుతున్న డెట్రాయిట్ ఆటో షోకు తీసుకువచ్చింది. ఇటాలియన్ కార్‌మేకర్‌ ఫియట్‌కు చెందిన బ్రాండ్ అయిన మాసేరటి డెట్రాయిట్ ఆటో షోలో కుబాంగ్ ఎస్‌యూవీని ప్రదర్శించింది.
Maserati Kubang SUV

మాసరేటి కుబాంగ్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2003వ సంవత్సరంలో జరిగిన న్యూయార్క్ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ ప్రదర్శిస్తున్న కుబాంగ్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్‌కు సంబంధించినది. త్వరలోనే ఇది అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది.

సిబిఐ తవ్వకాల్లో బయటపడిన గాలి లగ్జరీ కార్ కలెక్షన్

మైనింగ్ దిగ్గజం గాలి జనార్థన్ రెడ్డి వద్ద ఉన్న కార్ కలెక్షన్ గురించి గతంలో ఓ తెలుగు డ్రైవ్ స్పార్క్ ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాతి కాలంలో గాలి జనార్థన్ రెడ్డిపై సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తుల అనంతరం మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గాలి జనార్థన్ రెడ్డి తన దర్పాన్ని, రాజసాన్న చూపించేందుకు అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లను ఉపయోగించినట్లు ఈ దర్యాప్తులో తేలింది. గాలి జనార్థన్ రెడ్డి వద్ద ఉన్న కార్లు/బ్రాండ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ బ్రాండ్లను చూస్తుంటే గాలి జనార్థన్ రెడ్డి ఫారిన్ కార్లపై ఎంత లవ్వు ఉందో ఇట్టే అర్థమవుతుంది.

- మాసేరటి
- మెర్సిడెస్ బెంజ్ లీమోజైన్
- ఆడి
- రోల్స్ రాయిస్ ఫాంటమ్
- టొయోటా ల్యాండ్ క్రూజర్
- రూ.3 కోట్లు విలువ చేసే కాంటినెంటర్ జిటి కూపే
- లెక్కలేనన్ని మిత్సుబిషి పాజెరో ఎస్‌యూవీలు
- రూ.3 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్
- రూ.5 కోట్లు విలువ చేసే వోల్వో బస్ (దీనిని రుక్మిని అని పిలుస్తారు)

ఇవేకాకుండా 12 మేడ్ ఇండియా కార్లు కూడా గాలి జనార్థన్ రెడ్డి వద్ద ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిని పార్క్ చేసేందుకు ఓ ప్రత్యేకమైన స్థలాన్ని నిర్మించడంతో పాటుగా వీటిని పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేకమైన బృందాన్ని కూడా నియమించడం జరిగింది. ఇన్ని కార్లున్నప్పటికీ, సిబిఐ మాత్రం కేవలం మాసేరటి, రోల్స్ రాయి కార్లను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.Gali Janardhan Reddy

మాసేరటి కారుకు ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు, అంటే బహుశా దీన్ని ఇంకా ఉపయోగించినట్లు లేదని తెలుస్తోంది. సిబిఐ జప్తు చేసిన వాటిల్లో 57.89 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 2.49 కోట్ల విలువైన నగదు ఉన్నాయి. ఇవి కాకుండా గాలి జనార్థన్ రెడ్డి "బెల్ 407" హెలికాఫ్టర్ కూడా ఉంది.

తన వ్యక్తిగత ప్రయోజనం కోసం దీన్ని కొనుగోలు చేయడం జరిగింది ఈ హెలికాఫ్టర్‌ను ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రై లి కంపెనీ పేరుపై రిజిస్టర్ చేయబడి ఉంది. దీన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకొని భద్రంగా ఉంచడం కోసం డెక్కన్ ఛార్టర్స్ లిమిటెడ్‌కు ఇవ్వడం జరిగింది.

స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ విడుదల

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు పెట్టే కార్లను తయారు చేసే, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బుగాటి అందిస్తున్న "వేరాన్" మోడల్‌లో మరో సరికొత్త వెర్షన్‌ను దోహాలో జరుగుతున్న ఖతార్‌ మోటార్‌ షోలో ఆవిష్కరించింది. 2.05 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా) కలిగిన ఈ "స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్"ను బుగాటి ఖాతర్‌లో విడుదల చేసింది.Special Edition Bugatti Veyron 16.4 Grand Sport

వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ స్టాండర్డ్ వేరియంట్ ధర 1.82 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా)గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే ఓపెన్ టాప్ కారు. సరికొత్త స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ను పూర్తిగా పసుపు, నలుపు రంగుల కలయికతో పెయింటింగ్ చేయబడి, ఇంటీరియర్స్‌లో అధిక భాగం అదే రంగులను ఉపయోగించడం జరిగింది. స్పోర్టీ లుక్ కోసం ఈ రంగులను ఉపయోగించారు.

స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ విడుదల

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు పెట్టే కార్లను తయారు చేసే, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బుగాటి అందిస్తున్న "వేరాన్" మోడల్‌లో మరో సరికొత్త వెర్షన్‌ను దోహాలో జరుగుతున్న ఖతార్‌ మోటార్‌ షోలో ఆవిష్కరించింది. 2.05 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా) కలిగిన ఈ "స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్"ను బుగాటి ఖాతర్‌లో విడుదల చేసింది.Special Edition Bugatti Veyron 16.4 Grand Sport

వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ స్టాండర్డ్ వేరియంట్ ధర 1.82 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా)గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే ఓపెన్ టాప్ కారు. సరికొత్త స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ను పూర్తిగా పసుపు, నలుపు రంగుల కలయికతో పెయింటింగ్ చేయబడి, ఇంటీరియర్స్‌లో అధిక భాగం అదే రంగులను ఉపయోగించడం జరిగింది. స్పోర్టీ లుక్ కోసం ఈ రంగులను ఉపయోగించారు.

ఉప ఎన్నికల్లో బాలకృష్ణ పోటీపై పెదవి విప్పిన బాబు

ఏలూరు: హీరో నందమూరి బాలకృష్ణ ఉప ఎన్నికల్లో పోటీ చేయరని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఆయన ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో బాలయ్య పోటీ చేయరన్నారు. 2014 ఎన్నికలే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. ఆయన ఎక్కడి నుండి పోటీ చేయాలో ఎప్పుడు పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ప్రChandrababu Naidu-Balakrishna
స్తుతం బాలయ్య సినిమాల్లో నటిస్తున్నారని త్వరలో ఆయన భవిష్యత్తు పార్టీలో నిర్ణయిస్తామన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిలు వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రులు అన్నారు. రాజకీయంగా మాత్రం వారితో విభేదిస్తానన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు స్థలం కేటాయించింది తానేనన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని అది సరికాదన్నారు. అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీయేనన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోలవరం టెండర్ల కోసం కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారన్నారు. రాష్ట్రంలోని ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం పనులు నాసిరకంగా తయారవుతున్నాయని ఆరోపించారు. దానిని త్వరగా పూర్తి చేయాలన్నారు. కేంద్రంలో వామపక్షాలతో సత్సంబంధాలు ఉన్నాయని, ప్రస్తుతానికి మహాకూటమి ఆలోచన లేదన్నారు.

ఎవరినైనా పక్కన పెడ్తాం: జూ. ఎన్టీఆర్‌పై చంద్రబాబు

విజయవాడ: తన మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరంగా ఉంచడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కృష్ణా జిల్లా పోరుబాటలో భాగంగా పాదయాత్ర చేసిన చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌పై మాట్లాడారు. పార్టీకి కట్టుబడి పని చేయకపోతే ఎవరిైనా పక్కన పెడతామని ఆయన అన్నారు. పార్టీకి ఎవరూ అతీతులు కారని ఆయన అన్నారు. పార్టీకి సేవ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వారి సేవలను ఎలా వియోగించుకోవాలో పార్టీ అధ్యక్షుడిగా తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. కుటుంబ వేరు, పార్టీ వేరని ఆయన అన్నారు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఏర్పడిందని, తమ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ పార్టీ వైపు చూస్తున్నారని, అందువల్ల ఎవరు పనిచేసినా అందుకు అనుగుణంగానే ఉండాలని ఆయన అన్నారు. ఓ ప్రముఖ టీవీ చానెల్‌ ప్రతినిధికి ఇంటర్వూ ఇస్తూ ఆయన జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. Chandrababu Naidu-Jr Ntr

2014లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని ఆయన అన్నారు. పార్టీకి సేవ చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా తాము ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. బాలకృష్ణ సహా అందరూ పార్టీ నిర్ణయాలకు, నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కొల్లేరు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు తాము అధికారంలోకి వస్తే చేపల చెరువులకు సంబంధించి 7500 ఎకరాలను పేదలకు పంచుతామని ఆయన చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు సరిగా లేకున్నా రెండో పంటకు నీరు విడుదల చేశామని ఆయన చెప్పారు.

అంతకు ముందు చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. హీరో బాలకృష్ణ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోరని ఈ సందర్భంగా చెప్పారు. బాలయ్య ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.

2012 JANUARY 14 శ్రీ చెన్నకేశవ స్వామి సంక్రాంతి పర్వ దినం సందర్బంగా వింజమూరు గ్రామాంలో ఇలా గ్రామస్తులకి దర్శనం ప్రశాధించాడు.





9, జనవరి 2012, సోమవారం

'నేను తాప్సీని కాదు' అనే దాకా వదలేదు

Tapsi
ఒకేసారి అంతమంది చుట్టుముట్టి ‘మీరు తాప్సీయే కదా?’అని అడగడంతో భయం వేసింది. నాతో పాటు నా మేకప్ ఆర్టిస్ట్, నా అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. వాళ్లు, నేను కలిసి ‘నేను తాప్సీ కాదు’ అని వారిని నమ్మించడానికి నానా పాట్లు పడ్డాం అంటోంది తాప్సీ. డిసెంబరు 31న రోడ్డు మీద జరిగిన ఓ సంఘటన గురించి వివరిస్తూ..అలాగే...గత నెల చివరి రోజున బదామీ నుంచి హైదరాబాద్‌కి కారులో వస్తున్నాను. మార్గమధ్యంలో ఓ గ్రామం దగ్గర కారు హఠాత్తుగా ఆగిపోయింది. అక్కడ వీధి లైట్లు కూడా లేవు. మెకానిక్ షెడ్ లేదు. ఏం చెయ్యాలో దిక్కు తోచక చూస్తున్న సమయంలో ఒక 50మంది మా కారుని చుట్టుముట్టేశారు.

వారు తాప్సీ అని అడుగుతూ ముందుకు వస్తున్నారు. నేను తాప్సీ అంటే వాళ్లేదో చేస్తారని కాదు.. ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లంటూ ఒత్తిడి చేస్తారేమోనని, ఆ రభసకు ఇంకొంతమంది గుమిగూడిపోతారని భయపడ్డాను. అందుకని ‘నేను.. నేను కాదు. వేరే అమ్మాయిని’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. బహుశా ఇలాంటి విచిత్ర పరిస్థితి ఎవరికీ ఎదురు కాదేమో. ఈ ఇబ్బందికర పరిస్థితిల్లోంచి బయటపడేస్తూ.. మా కారు వర్క్ ఫినిష్ అయ్యింది. దాంతో ఉషారుగా హైదరాబాద్ వచ్చేశాం అంది తాప్సీ. ప్రస్తుతం ఆమె లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో పల్లెటూరి యువతి సరళ పాత్రను పోషిస్తోంది. లంగా, ఓణీ, రెండు జడలు, కళ్లకు కాటుక... ఇలా అసలు సిసలు పల్లె పడచులా ఆమె కనపడనుంది.